Wednesday, October 8, 2025
Homeక్రీడలుబాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

యునైటెడ్ కింగ్ డమ్ లివర్ పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలిచారు. కజకిస్థాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో మీనాక్షి ఓడించారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణ పోరుకు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్‌లో బంగారు పతకం సాధించింది. కాగా బాక్సింగ్  విభాగంలో భారత్ తరుపున జైస్మిన్ లంబోరియా ఇప్పటికే స్వర్ణం గెలుచుకుంది. పోలాండ్‌కు చెందిన స్జెర్మెటా జూలియాను 4-1 తేడాతో ఓడించి తన విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments